విజయవాడలో జరిగిన ఓ సభలో సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఇటీవల విపరీతంగా వైరల్ అవుతున్న ఒక వీడియో రీల్ను ప్రస్తావిస్తూ “మీరంతా ఆ రీల్ చూశారా..?” అని సభలో ఉన్న యువతను సీఎం నేరుగా ప్రశ్నించారు. సుదూర ప్రాంతమైన లడఖ్కు వెళ్లిన ఒక తెలుగు పర్యాటకుడు తాను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానని చెప్పగానే, అక్కడి ఒక చిన్నారి ఏమాత్రం తడబడకుండా వెంటనే ‘అమరావతి’ అంటూ సమాధానం ఇచ్చిన వైనాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.
దేశంలోనే అత్యంత మారుమూల ప్రాంతమైన లడఖ్ కొండల్లో సైతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి మాట్లాడుకుంటున్నారంటే, ఈ నగరానికి దేశవ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు మరియు ఆదరణ లభించిందో అర్థం చేసుకోవచ్చని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ప్రజలు అమరావతి నగరం గురించే గొప్పగా మాట్లాడుకునే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అయిన అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామి గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని, ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణంగా మారుతుందని స్పష్టం చేశారు. కేవలం మౌలిక వసతుల కల్పన మాత్రమే కాకుండా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కూడా అమరావతిని కేరాఫ్ అడ్రస్గా మార్చబోతున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగానే దేశంలోనే మొట్టమొదటి ప్రతిష్టాత్మక ‘క్వాంటం కంప్యూటర్’ కూడా అమరావతి నగరంలోనే ప్రారంభం కాబోతోందని, డిసెంబర్ కల్లా ఇది అందుబాటులోకి వస్తుందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.
https://x.com/ncbn/status/2098679498489430346/video/1













