జగన్ స్వయంకృతాపరాధం..? 16 వేల మంది టీచర్లతో వైరం..!

0
2

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 16,000 మంది ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం కొలువులు అందించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాబోయే 2029 సంవత్సరం వరకు నిరంతరాయంగా మరిన్ని ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. దీనికి అదనంగా రాష్ట్రంలో సరికొత్తగా భారీ ఎత్తున పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియను కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే ఈ నియామకాలను, డీఎస్సీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం భవిష్యత్తులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా మారే ప్రమాదం కనిపిస్తోంది అంటున్నారు పరిశీలకులు.

రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 2029 సార్వత్రిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సాధారణంగా ఏ ఎన్నికలైనా క్షేత్రస్థాయిలో నిర్వహించేది ప్రభుత్వ ఉద్యోగులే. ఈ 16,000 మంది కొత్త ఉపాధ్యాయులు, భవిష్యత్తులో విధుల్లో చేరే నూతన ఉద్యోగులు, నూతన పోలీస్ సిబ్బంది రాబోయే ఎన్నికలలో నేరుగా ఎలక్షన్ డ్యూటీలలో పాల్గొంటారు. జగన్ నిరంతరం డీఎస్సీ అభ్యర్థుల ఎంపికను వివాదాస్పదం చేయడం వల్ల ఈ ఉద్యోగులలో ఒక విధమైన అభద్రతాభావం నెలకొంది. భవిష్యత్తులో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయో అనే భయం వారిని తీవ్రంగా వేధిస్తోంది.

ఈ మానసిక ఆందోళన కారణంగా వారు ఎన్నికల విధుల్లో వైసీపీ పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ప్రభుత్వ ఉద్యోగులతో వైరం పెట్టుకోవడం ఏ రాజకీయ పార్టీకి కూడా మేలు చేయలేదు. ఈ కొత్త ఉద్యోగులే కాకుండా వారి వెనుక ఉన్న కుటుంబ సభ్యులు కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసే పరిస్థితి కనిపించడం లేదు. లక్షలాది ఓట్లపై ప్రభావం చూపగల ఈ వర్గాన్ని జగన్ తన వ్యాఖ్యల ద్వారా దూరం చేసుకుంటున్నారు. ఉద్యోగుల వ్యతిరేకతను మూటగట్టుకోవడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక సమరంలో కూడా జగన్‌కు తీవ్రమైన రాజకీయ ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.