35 C
Vijayawada
Tuesday, September 1, 2026
Homeజాతీయ నీతిమోడీ ఫార్ములా వర్కౌట్ అయిందా..? జీడీపీ గాడిలో పడ్డట్టే..!

మోడీ ఫార్ములా వర్కౌట్ అయిందా..? జీడీపీ గాడిలో పడ్డట్టే..!

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక అనిశ్చితి, యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు.. ఊహించిన దానికంటే వేగంగా 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ అద్భుతమైన ప్రగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కిర్గిజిస్తాన్ పర్యటనలో ఉన్న ఆయన, మంగళవారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ వృద్ధి రేటు దేశప్రజల కష్టార్జితానికి, సామూహిక సంకల్ప బలానికి నిదర్శనమని కొనియాడారు.

ప్రస్తుతం ప్రపంచమంతా యుద్ధాలు, సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోందని, గ్లోబల్ సప్లై చైన్ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ భారత్ ఇంతటి ఘనవిజయాన్ని సాధించడం గర్వకారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అయితే, అంతర్జాతీయ యుద్ధ వాతావరణం వల్ల వచ్చే ఆర్థిక నష్టాల నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి దేశీయులంతా ‘స్వదేశీ’ మంత్రాన్ని జపించాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగానే, విదేశీ కరెన్సీ నిల్వలపై ఒత్తిడి తగ్గించేందుకు మరియు దేశీయ మార్కెట్‌ను బలోపేతం చేసేందుకు ప్రజలంతా స్వయం సమృద్ధి వైపు అడుగులు వేయాలని కోరారు.

ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ కొన్ని కీలక సూచనలు చేశారు. పర్యాటకం కోసం అనవసరంగా విదేశాలకు వెళ్లడం తగ్గించాలని, పెళ్లిళ్ల కోసం విదేశీ గమ్యస్థానాలను ఎంచుకోకుండా ‘వెడ్ ఇన్ ఇండియా’ అనే విధానాన్ని అవలంబించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, అత్యవసరం అయితే తప్ప అనవసరంగా బంగారం కొనుగోలు చేయవద్దని కూడా ఆయన గట్టిగా కోరారు. మనం ఎంత ఎక్కువగా స్థానిక ఉత్పత్తులు, సేవలను ప్రోత్సహిస్తే, దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి భారతదేశాన్ని సంపూర్ణ వికసిత భారత్‌గా మార్చడమే మన లక్ష్యం కావాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments