30 C
Vijayawada
Sunday, August 30, 2026
Homeఆంధ్రప్రదేశ్అగ్రిగోల్డ్ భూములను కొట్టేసిన కడప నేతలు!

అగ్రిగోల్డ్ భూములను కొట్టేసిన కడప నేతలు!

జిల్లాలోని ప్రొద్దుటూరు పరిధిలో అత్యంత విలువైన ‘అగ్రిగోల్డ్’ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కోర్టు పరిధిలో ఉన్న అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన భూములను కొందరు వ్యక్తులు చట్టవిరుద్ధంగా తమ పేర్లపై మార్పిడి చేసుకున్నట్లు అధికారికంగా ఫిర్యాదులు అందాయి. ఈ మెగా భూకుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపిన పోలీసులు.. అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులతో పాటు, వారికి సహకరించిన అప్పటి ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్‌పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ఈ భూములను ప్రత్యేక పరిరక్షణలో ఉంచినప్పటికీ, నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి ఈ దందా సాగించినట్లు సమాచారం. నకిలీ పత్రాలు సృష్టించి, భారీగా చేతులు మారిన నిధులతో ఈ విలువైన స్థలాలను రిజిస్ట్రేషన్ చేసినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో కీలక రాజకీయ నాయకుల హస్తం ఉండటంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొట్టడంపై ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు.

ఈ భూకుంభకోణం యొక్క తీవ్రతను దృష్ట్యా కేసును తిరుపతి సీఐడీ విభాగానికి బదిలీ చేశారు. రంగంలోకి దిగిన తిరుపతి సీఐడీ అధికారులు ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైకాపా నేతలతో పాటు, ఈ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు సీఐడీ దళాలు విచారణను ముమ్మరం చేశాయి. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరికొంతమంది కీలక అధికారుల అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments